Indian Embassy Issues Advisory: ఇజ్రాయెల్ లోని భారతీయులకు కేంద్రం అడ్వైజరీ

by Shamantha N |
Indian Embassy Issues Advisory: ఇజ్రాయెల్ లోని భారతీయులకు కేంద్రం అడ్వైజరీ
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. హెజ్ బొల్లా, హమాస్ అగ్రనేతలను చంపిన ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణుల వర్షఁ కురిపించింది. ఇరాన్ ఇజ్రాయెల్ పై 200కు పైగా క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్‌ దాడి చేస్తుందని అమెరికా అంతకుముందే అలర్ట్‌ చేసింది. ఈ హెచ్చరికల దృష్ట్యా ఇజ్రాయెల్ లోని భఆరతీయులకు కేంద్రం అడ్వైజరీ జారీ చేసింది. దృష్టిలో ఉంచుకుని, ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులకు భారతదేశం ఒక అడ్వైజరీ జారీ చేసింది. ముందుజాగ్రత్తగా అక్కడ నివసిస్తున్న భారతీయులను సురక్షిత ప్రదేశాలలో ఉండాలని ఇండియన్ ఎంబసీ కోరింది. ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడి అధికారులతో నిరంతరం టచ్‌లో ఉందని.. యుద్ధ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని భారత్ తెలిపింది. భారత్‌ హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఇకపోతే, ఇజ్రాయెల్‌లో 32 వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఇరాన్ క్షిపణి దాడికి ముందు పౌరులందరూ బాంబు షెల్టర్లకు వెళ్లినట్లు సమాచారం.

ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతు

ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌ కు అమెరికా మద్దతు ప్రకటించింది. ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకున్న క్షిపణులను కూల్చివేయడంలో సహాయం చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యూఎస్ మిలిటరీని ఆదేశించారు. మరోవైపు, ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా, ప్రపంచంలో ఉగ్రవాదం, యుద్ధానికి చోటు లేదని మోడీ నొక్కి చెప్పారు. మరోవైపు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇరాన్ పాలకుడిపై విమర్శలు చేశారు. ఇరాన్ పాలన చేయడం ద్వారా ఈ ప్రాంతమంతా యుద్ధం వైపు నెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఇరాన్ పాలకుడి ప్రాథమిక లక్ష్యం ప్రజల సంక్షేమం కాదు, లెబనాన్, గాజా ప్రాంతంలో.. దానితో డబ్బును వృథా చేయడమని అన్నారు.

Next Story

Most Viewed