- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
MP Raghanandan Rao : అసమర్ధ రేవంత్ రెడ్డితో తెలంగాణలో పాలన పడకేసింది : ఎంపీ రఘనందన్ రావు

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పాలన పడకేసిందని సీఎం రేవంత్రెడ్డికి పాలన చేతకాక ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారని ఎంపీ రఘనందర్రావు విమర్శించారు. ఎస్ఎల్బీసీ వద్దకు వెళ్లేందుకు ముఖ్యమంత్రికి వారం రోజుల వరకు సమయం దొరకలేదని వ్యంగ్యంగా ఆరోపించారు. ఆదివారం బీజేపీ రాష్ట్రం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ లేకుండా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి వచ్చారని ఓ వేళ ఆయనను కలిస్తే ఒక్క ఫోటో కూడా ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. బీసీల ఓట్ల కోసమే పీసీసీ అధ్యక్ష పదవి బీసీకి ఇచ్చారనని, ముఖ్యమంత్రి పదవి సైతం బీసీలకు ఇవ్వాలని అధిష్టానానికి లేఖ రాయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్కు సూచించారు. జీహెచ్ఎంసీలో ఓ ఉన్నతాధికారి గత ఐదేళ్లుగా డిప్యూటేషన్పై పని చేస్తున్నారని, ఆయన ఎందుకు బదిలీ చేయడం లేదని నిలదీశారు. మున్సిపల్ పాలనపై రేవంత్ రెడ్డికి పట్టు లేదన్నారు.
వరంగల్లో ఏర్పాటు కానున్న మమునూరు ఎయిర్ పోర్ట్ గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. గద్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే తన ఫొటోలను కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీల్లో వేస్తున్నారని చెప్పిన దీనికి ఆపార్టీ నేతల వద్ద సమాదానం లేదన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలంతా తిరిగి తమ సొంత గూటికి వెళ్లేందుకు సిద్దమవుతోన్నారన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సౌమ్యుడు, ఇప్పటివరకు ఆయన ఎలాంటి ఆరోపణలు లేవని ఉద్దేశ్య పూర్వకంగా సీఎం రేవంత్ఆయనపై లేని నిందలు వేస్తున్నారని విరుచుకపడ్డారు. ఆరు మంత్రి పదవులను భర్తీ చేసుకోలేని దుస్థితిలో ఉన్నారని, ప్రధాని మోదీతో కలిసిన ఫొటో అధికారికంగా విడుదల చేశారని రాహుల్ గాంధీని కలిసిన ఫోటో ఎక్కడ పోయిందని ఎద్దేశా చేశారు. త్రిభాషా సిద్దాంతానికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీనేనని గుర్తు చేశారు.
అలాంటి కాంగ్రెస్ సిద్దాంతానికి వ్యతిరేకంగా సీఎం మాట్లాడుతున్నారని, తెలంగాణలో ఉర్దూ భాష ఎందుకు రాస్తున్నారని ప్రశ్నించారు. 90 శాతం ప్రజలకు ఉర్దూ రాకున్నా బోర్డులపై ఎందుకు ఆ భాషను రాస్తున్నారని సందేహం వ్యక్తం చేశారు. ఎవరికి భయపడి ఉర్దూ భాష రాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడు అనుమతి తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి తెలుగులో మాట్లాడరని పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ నేతలు ఏ భాషలో మాట్లాడతారని సందేహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత విమర్శలపై తాము మాట్లాడగలమని కానీ సిద్దాంతం మీద ప్రజా సమస్యలపై చర్చకు సిద్ధమన్నారు. వేదిక, సమయం చెప్పాలంటూ సవాల్ విసిరారు. రాష్ర్ట ప్రభుత్వం కేటీఆర్ మీద ఏసీబీ కేసు పెట్టిందని దానికి కేంద్రానికి ఏం సంబంధమని ప్రశ్నించారు.
ఎందుకు కేటీఆర్ను అరెస్ట్ చేయడానికి భయపడుతున్నారన్నారు. గతంలో ఏసీబీ అరెస్ట్ చేసిన విషయాన్ని మరిచిపోయినట్లు ఉన్నారంటూ సీఎం రేవంత్కు చురకలంటించారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ ఫీజిబులిటీ ఉంటేనే ఇవ్వాలని పునర్విభజన చట్టంలో ఉందని కానీ దానికి ఫీజిబులిటీ లేదని తేలిందన్నారు. డిలిమిటేషన్ జరగాలంటే ముందు జనగణన జరగాల్సి ఉందన్నారు. ఇక తమిళనాడు సీఎం స్టాలిన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి పదేళ్లు కావస్తోందని ఆయన ముఖం చెల్లకే హిందీ భాష, డిలిమిటేషన్ అంశాలతో తన కొడుకుని ముఖ్యమంత్రిని చేయ్యాలని అనుకొంటున్నారన్నారు. అయితే 2026 చివరలోనే డిలిమిటేషన్ జరిగేదని వెల్లడించారు.