Go 46: అమరవీరుల స్థూపం ముందు జీవో 46 బాధితుల ఆందోళన

by Prasad Jukanti |
Go 46: అమరవీరుల స్థూపం ముందు జీవో 46 బాధితుల ఆందోళన
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 46ను రద్దు చేయాలని బాధిత అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. నిన్న చీకట్లోనే ప్రజాభవన్ ఎదుట నిరసన తెలిపిన బాధితులు శనివారం అమరవీరుల స్థూపం ముందు ఆందోళనకు దిగారు. సచివాలయం వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన చేస్తున్న అభ్యర్థులను అరెస్టు చేశారు. జీవో నంబర్ 46 ను రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed