Gandhi Jayanti : రాష్ట్ర వేడుకగా గాంధీ జయంతి.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

by Ramesh N |
Gandhi Jayanti : రాష్ట్ర వేడుకగా గాంధీ జయంతి.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ పుట్టిన రోజైన అక్టోబర్ 2న గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటాం. ఐక్య రాజ్య సమితి అక్టోబర్ 2 ను "ప్రపంచ అహింసా దినం" గా ప్రకటించిన విషయం తెలిసిందే. నాయకులు, విద్యార్థులు, ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఆ రోజు మహాత్ముడికి నివాళులు అర్పిస్తారు.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం గాంధీ జయంతిపై కీలక నిర్ణయం తీసుకుంది. గాంధీ జయంతిని రాష్ట్ర వేడుకగా ప్రకటించింది. ప్రభుత్వంలోని వివిధ శాఖలకు బడ్జెట్ నుంచే జయంతి వేడుకల నిర్వహణ ఖర్చును విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోమవారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జీవో విడుదల చేశారు.

Advertisement

Next Story