పేకాట స్థావరం పై గద్వాల రూరల్ పోలీసుల దాడి

by Prasanna |   ( Updated:2024-09-04 06:06:11.0  )
పేకాట స్థావరం పై గద్వాల రూరల్ పోలీసుల దాడి
X

దిశ, గద్వాల క్రైం : జోగులాంబ గద్వాల (Gadwal) జిల్లా కేంద్రంలోని అనంతాపురం, పూడూరు గ్రామ శివారులో కొందరు పేకాట స్థావరం నిర్వహిస్తున్నట్లు మంగళవారం సాయంత్రం గద్వాల రూరల్ పోలీసులకు సమచారం అందగా జిల్లా ఎస్పీ టీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు, రూరల్ ఎస్సై సి హెచ్ శ్రీకాంత్ తన సిబ్బందితో కలిసి వ్యూహాత్మకంగా నిఘా ఉంచి పేకాట స్థావరం పై దాడి చేసి ఒకరిని అరెస్ట్ చేయగా, మరి కొందరు పారిపోయారని ఎస్సై తెలిపారు. వారి నుండి (32000/-) ముప్పైరెండు వేల రూపాయాల నగదు, ఒక స్కూటీ, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకొని, 11మంది వినోద్ - మేలచెరువు, చరణ్ - మేలచెరువు, తిమ్మప్ప- కుర్వపల్లె, గోవర్దన్-కొండపల్లి, నరసింహ- దౌదర్ పల్లి, జానీ అలియాస్ చంద్రన్న -మేలచెరువు, ప్రభాకర్-మేలచెరువు, తిమ్మన్న - గద్వాల, పరుష - కుర్వపల్లె, సుధాకర్ - మార్ల బీడు, ఆంజనేయులు - కుర్వపల్లె) పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed