ఎమ్మెల్యేగా ఓడినందుకు హ్యాపీగా ఉన్నా: జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్

by Satheesh |
ఎమ్మెల్యేగా ఓడినందుకు హ్యాపీగా ఉన్నా: జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మె్ల్యేగా ఓడినందుకు చాలా ప్రశాంతంగా ఉన్నానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఓడిపోయానని బాధపడాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో మన ప్రభుత్వమే అధికారంలో ఉందని కావాల్సిన పనులు జరుగుతాయని కార్యకర్తలకు భరోసా కల్పించారు. ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ సంగారెడ్డి ప్రజలకు జవాబుదారీగా ఉంటానని, రెండు నెలల తర్వాత ప్రతి సోమవారం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.

నా కోసం గాంధీ భవన్‌కు రావొద్దని కార్యకర్తలు, అభిమానులకు ఈ సందర్భంగా జగ్గారెడ్డి సూచించారు. కాగా, గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ నుండి బరిలోకి దిగిన జగ్గారెడ్డి.. బీఆర్ఎస్ క్యాండిడేట్ చింతా ప్రభాకర్ చేతిలో ఓటమి పాలయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పవర్ లోకి వచ్చినప్పటికీ సొంత నియోజకవర్గంలో ఓటమి పాలు కావడంతో జగ్గారెడ్డికి మంత్రి పదవి మిస్ అయ్యింది. దీంతో జగ్గారెడ్డి టీపీసీసీ చీఫ్ పోస్ట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed