- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Harish Rao: ఆశాలను పోలీసులు ఇష్టారీతిన కొట్టడం దుర్మార్గం.. హరీశ్రావు ఫైర్

దిశ, డైనమిక్ బ్యూరో: ఆశా వర్కర్ల ఆందోళన (ASHA workers' agitation) పై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) స్పందించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఒకవైపు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని గొప్పలు చెబుతూ, మరోవైపు క్షేత్రస్థాయిలో విశిష్ట సేవలందించే ఆశా తల్లులపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆశా వర్కర్ల వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పిస్తామని అభయహస్తం మేనిఫెస్టో పేజి నెంబర్ 26 లో హామీ ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు ఆ హామీ అమలు చేయాలంటూ ఆశా అక్కా చెల్లెళ్లు రోడ్డెక్కితే పోలీసులతో ఇష్టారీతిన కొట్టించడం దుర్మార్గమన్నారు.
ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు సేవలందించే ఆశా వర్కర్లకు నిరసించే హక్కు లేదా? సమస్యలు పరిష్కరించాలని అడిగే స్వేచ్చ లేదా? ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఆశాల గౌరవ వేతనం రూ. 1500 మాత్రమే ఉంటే, కేసీఆర్ గారు రూ. 10వేలకు పెంచి వారి సేవలను గుర్తించి, వారిని గౌరవించారని గుర్తుకు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీ నెరవేర్చలేదన్నారు. ప్రశ్నిస్తే పోలీసులతో పళ్లూడగొట్టించే దుర్మార్గ వైఖరిని అవలంబిస్తూ, ఆశాల ఆశలపై నీళ్లు చల్లుతుండటం సిగ్గుచేటని విమర్శలు చేశారు.