Floods 2024: తెలంగాణ వరద బాధితులకు పవన్ కళ్యాణ్ హీరోయిన్ భారీ విరాళం

by Ramesh Goud |
Floods 2024: తెలంగాణ వరద బాధితులకు పవన్ కళ్యాణ్ హీరోయిన్ భారీ విరాళం
X

దిశ, డైనమిక్ బ్యూరో: వరద బాధితులకు ప్రముఖ నిర్మాత, నటి సుప్రియ యార్లగడ్డ భారీ విరాళం ప్రకటించారు. ఈ మేరకు 50 లక్షల చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల తెలంగాణలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఈ వరదల్లో చాలా మంది ఆవాసం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. దీంతో వరద బాధితులకు సాయం చేసేందుకు చాలా మంది ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ నిర్మాత, నటి సుప్రియ యార్లగడ్డ వరద బాధితుల సాహాయార్ధం ముందుకు వచ్చారు. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షలు విరాళాన్ని ప్రకటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ తరుపున సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నందుకు సీఎం వారిని అభినందించారు.

Advertisement

Next Story