హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వద్ద తీవ్ర ఉద్రిక్తత!

by Disha Web Desk 5 |
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వద్ద తీవ్ర ఉద్రిక్తత!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇవ్వాళ ఐపీఎల్ మ్యాచ్ నేపధ్యంలో ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఐపీఎల్ సీజన్-17 లో భాగంగా హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు సంబందించి టికెట్లను పెద్ద ఎత్తున బ్లాక్ లో అమ్మారంటూ యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న జగన్మోహన్ రావు తనకు చెందిన అక్షర స్కూల్స్ యాజమాన్యంతో కుమ్మక్కు అయ్యి ఐపీఎల్ టికెట్లను అక్రమంగా అమ్మారంటూ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేనా రెడ్డి ఆరోపించారు. ఐపీఎల్ టికెట్లను అక్రమంగా అమ్ముకున్న జగన్మోహన్ రావును వెంటనే సస్పెండ్ చేయాలని రోడ్డుపై ఆందోళన చేపట్టారు. నిరసన కారులు స్టేడియంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారు జగన్మోహన్ రావుపై సత్వరమే చర్యలు చేపట్టాని ఆయన దిష్టి బొమ్మను చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed