త్వరలో కేబినెట్ విస్తరణ.. ఆ నలుగురుకి ఛాన్స్!

by Rajesh |
త్వరలో కేబినెట్ విస్తరణ.. ఆ నలుగురుకి ఛాన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో పాలనపై ఫోకస్ పెంచింది. ఇందులో భాగంగానే త్వరలో కేబినెట్ విస్తరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కాకుండా మొత్తం 11 మంది కేబినెట్ లో ఉన్నారు. త్వరలోనే మరో నలుగురికి కేబినెట్ లో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ నుంచి బోధన్ ఎమ్మెల్యేగా గెలిచిన సుదర్శన్ రెడ్డికి చాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి ముదిరాజ్ కోటాలో అవకాశం దక్కనున్నట్లు తెలిసింది.

భువనగిరి ఎంపీ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపులో కీలక పాత్ర పోషించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి వర్గంలో చోటు దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో వైపు ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి గడ్డం వివేక్‌ను సైతం మంత్రి వర్గంలో తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు మంచిర్యాలు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు పేరు వినిపిస్తోంది. అయితే వీరిద్దరిలో ఎవరికీ ఛాన్స్ ఇస్తారనేది ఉత్కంఠగా మారింది. ఎస్టీల నుంచి ఒకరికి మైనార్టీల నుంచి మరొకరికి అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి నుంచి ఒకరికి మినిస్టర్ పోస్ట్ ఇవ్వనున్నట్లు తెలిసింది. తొలుత నలుగురికి అవకాశం కల్పించి మిగతా ఇద్దరకి తర్వాత మంత్రిగా ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed