ప్రభుత్వ ప్రచారానికి గోబెల్స్ మూర్చపోతారు.. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్

by Rajesh |
ప్రభుత్వ ప్రచారానికి గోబెల్స్ మూర్చపోతారు.. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇది భరోసా ఇచ్చిన ప్రభుత్వం కాదు .. ప్రజలకు బాకీ పడ్డ ప్రభుత్వం అన్నారు. అబద్ధాలతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ.. అవే అబద్దాలతో పాలన సాగిస్తోందన్నారు. రూ.6 వేల కోట్లతో రుణమాఫీ పూర్తయిందా ? అని ప్రశ్నించారు. ఈ రోజు లక్ష రుణం మాఫీ చేశామని చెబుతూ .. రూ.2 లక్షలు మాఫీ చేసినట్లు ప్రకటనలా అంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రచారం చూస్తే గోబెల్స్ కూడా మూర్చపోతారని సెటైర్లు వేశారు. యాసంగి రైతుబంధులోనే రూ.2 వేల కోట్లు ఎగ్గొట్టారన్నారు. రైతుభరోసా ప్రకారం చూస్తే రూ.6 వేల కోట్లు ఎగ్గొట్టారన్నారు. వానాకాలం రైతుభరోసా ఊసే లేదన్నారు.. కోటి 30 లక్షల ఎకరాలకే ఇస్తారనుకున్నా రైతులకు ఎకరాకు రూ.7500 చొప్పున రూ.10 వేల కోట్లు ఎగ్గొట్టారన్నారు.

రుణమాఫీ అంటూ ఇప్పుడు రూ.6 వేల కోట్లు ఇచ్చారని.. రూ.10 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కోటి 73 లక్షల మంది మహిళలకు ఏడు నెలలుగా నెలకు రూ.2500 చొప్పున బాకీ పడిందన్నారు. దీని అమలుకు ఏడాదికి రూ.41,700 కోట్లు కావాలన్నారు. 40 లక్షల మంది ఫించను దారులు, దివ్యాంగుల ఏడు నెలలుగా నెలకు రూ.2 వేల చొప్పున బాకీ పడిందన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగులకు ఏడు నెలలుగా నెలకు రూ.4 వేల చొప్పున బాకీపడిందన్నారు. రాష్ట్రంలో భూమిలేని కౌలు రైతులు 6.5 లక్షల మంది ఉన్నారని.. వారికి రూ.15 వేల చొప్పున రూ.975 కోట్లు ప్రభుత్వం బాకీపడిందన్నారు.

రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు ఇస్తామని చెప్పిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో 52 లక్షల మందికి పైగా ఉపాధిహామీ కూలీలు ఉన్నారని.. ఈ లెక్కన వారికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.6240 కోట్లు బాకీపడిందన్నారు. కోటి 30 లక్షల టన్నులకు వరిధాన్యానికి క్వింటాలుకు రూ.500 చొప్పున రూ.6500 కోట్లు బోనస్ ఎగ్గొట్టారన్నారు. సేకరించిన ధాన్యానికి కూడా రూ.500 బోనస్ ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో ఏటా ఆరులక్షల మంది విద్యార్థులు పది, ఇంటర్, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, ఎంఫిల్ పూర్తి చేసుకుంటున్నారన్నారు.వారికి కాంగ్రెస్ ప్రభుత్వం పది వేల నుండి రూ.లక్ష వరకు బాకీపడిందన్నారు. రూ.2 లక్షల రుణమాఫీపై రైతాంగాన్ని మభ్యపెట్టడం అన్యాయం అన్నారు.

Advertisement

Next Story

Most Viewed