- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
- ప్రపంచం
సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి
X
దిశ, వెబ్ డెస్క్ : మూసీ(Musi) నిర్వాసిత ప్రాంతాల్లో రెండోరోజు బీజేపీ నేతలు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేడు జియగూడ, లంగర్ హౌస్ మూసీ నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటించారు. మూసీ ప్రాజెక్టులో కమీషన్ల కోసం సామాన్య ప్రజలను రోడ్డున పడేస్తాం అంటే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మూసీ సుందరీకరణ అని ఊదర గొడుతున్న సీఎం రేవంత్ రెడ్డి మాతో కలిసి మూసీ పర్యటనకు రావాలని సవాల్ విసిరారు. మూసీ ప్రాజెక్టుకు బాధితుల్లో ఒక్కరు ఒప్పుకున్నా నిరసనలను విరమించుకుంటాం అని వెల్లడించారు. మూసీ నిర్వశితులకు బీజేపీ అండగా ఉంటుంది. ఇక్కడున్న పేదలకు బంజారాహిల్స్ లో స్థలాలు ఇచ్చి, అప్పుడు వారి ఇళ్లను కూల్చాలని, అప్పటిదాకా ఇక్క ఇటుక తీయడానికి కూడా ఒప్పుకోమంటూ ఏలేటి మండి పడ్డారు.
Advertisement
Next Story