- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి.. : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్
దిశ, సిటీ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 13న జరగనున్న పోలింగ్లో అత్యధిక శాతం ఓటింగ్ శాతం నమోదు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజు అన్నారు. నగరంలోని ఆబిడ్స్ లోని అల్ సెయింట్ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటర్ ఫెసిలిటెషన్ సెంటర్ను ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ వివరాలను తెలియజేసారు. సికింద్రాబాద్ పార్లమెంట్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రత్యేక పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు ఫెసి లిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు సీఈ ఓకు వివరించారు. ఫెసిలిటేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన వసతులు పట్ల రాష్ర్ట ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి జి హెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ సిపి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.