టెన్త్ పరీక్షలు తప్పిన విద్యార్థులకు విద్యాశాఖ కార్యదర్శి కీలక సూచన

by Disha Web Desk 4 |
టెన్త్ పరీక్షలు తప్పిన విద్యార్థులకు విద్యాశాఖ కార్యదర్శి కీలక సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పదోతరగతి పరీక్షలు మంగళవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పరీక్షలు తప్పిన విద్యార్థులు, వారి తల్లి దండ్రులకు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం కీలక సూచన చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఒత్తిడి గురికావొద్దని సూచించారు. విద్యార్థులు ఎలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. పరీక్షలు.. జీవితంలో ఒక భాగం మాత్రమే అన్నారు. పరీక్షల ఫలితాలే మన జీవితం కాదన్నారు. పరీక్షల్లో ఫెయిలైనా జీవితంలో అద్భుతాలు చేసినవారు ఎందరో ఉన్నారన్నారు.

Next Story