Telangana: మే 13వ తేదీన వేతనంతో కూడిన సెలవు.. ఈసీఓ వికాస్

by Disha Web Desk 3 |
Telangana: మే 13వ తేదీన వేతనంతో కూడిన సెలవు.. ఈసీఓ వికాస్
X

దిశ వెబ్ డెస్క్: తెలంగాణలో మే 13న లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ జరగనున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రోజు అనగా మే 13న వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటిస్తూ ఈసీఓ వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఎవరైనా ఇతర రాష్ట్రాలకు అంటే.. మహారాష్ట్ర, కర్ణాటక, ఛతీస్ఘడ్ కు చెందిన ఉద్యోగులు తమతమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళినట్లైతే.. వారికి కూడా వేతనం ఇవ్వాల్సిందిగా ఆయన జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ మే 13 వ తేదీన లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలోను మే 13 వ తేదీని సెలవు దినంగా ప్రకటించిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed