‘దిశ’ ఎఫెక్ట్.. 600 పడకల ఆసుపత్రికి గ్రీన్ సిగ్నల్

by Rajesh |
‘దిశ’ ఎఫెక్ట్.. 600 పడకల ఆసుపత్రికి గ్రీన్ సిగ్నల్
X

దిశ, ఖమ్మం : ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి 600 పడకలకు శాంక్షన్ ఉంటే 450 పడకలే ఉన్నాయని, 6వందల పడకల ఆసుపత్రి ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ నెల 25న ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న తీరుపై ‘దిశ’ దినపత్రికలో ‘వచ్చామా.. వెళ్లామా’ అనే కథనం ప్రచురించింది. ఆదివారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి పరిశుభ్రంగా ఉంచాలని మంత్రి తుమ్మల డాక్టర్లను ఆదేశించారు. ఆసుపత్రి ఆవరణ మొత్తం తిరిగి పరిశీలించారు. ఆసుపత్రిలో ఎక్కడ చూసినా అపరిశుభ్రంగా ఉందని, ఆసుపత్రిని ప్రతి రోజూ శుభ్రం చేయాలన్నారు. డాక్టర్లు అందుబాటులో ఉండి ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులతో మర్యాదగా మెలగాలన్నారు.

ఆస్పత్రిలో డాక్టర్లు, సిబ్బందిని నియమించేందుకు ఇప్పటికే ఔట్ సోర్సింగ్ కలెక్టర్ ప్రకటన విడుదల చేయడం జరిగిందన్నారు. ఆసుపత్రిలో డాక్టర్లు సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఆస్పత్రిలో మందుల కొరత రైతుల అంశాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే కలెక్టర్‌కు పలు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఆసుపత్రిలో రోగులకు అందే వైద్య ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి పరిశుభ్రంగా ఉంచాలని మంత్రి డాక్టర్లను ఆదేశించారు. విషయాలను డాక్టర్ల ద్వారా అడిగి తెలుసుకున్నారు. మాత శిశు కేంద్రం ఎదురుగా డ్రైనేజీ సరిగా లేకపోవడంతో మురుగు బయటకు రావడంతో మంత్రి సీరియస్ అయ్యారు. వెంటనే పనులు చేయాలని మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశించారు. వారంలో ఆస్పత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలని డాక్టర్లకు ఆదేశించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనిఖీ లో ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఆదివారం ఉండరా అని అడిగారు, సూపరింటెండెంట్ లీవ్‌లో ఉన్నారని వైద్యులు సమాధానం ఇచ్చారు. మంత్రి వెంట కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, మున్సిపల్ కమిషనర్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed