సీతారాం ఏచూరి కన్నుమూత.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

by Mahesh |   ( Updated:2024-09-12 11:38:47.0  )
సీతారాం ఏచూరి కన్నుమూత.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ రాజ్యసభ సభ్యుడు, సీపీఐఎం(CPIM) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అనారోగ్యంతో కన్నుమూశారు. గతకొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌(Delhi AIIMS)లో చికిత్స పొందుతూ.. గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. కాగా ఆయన మృతిపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని.. ఆయన పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed