- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
భారీ బందోబస్తు మధ్య దుండిగల్లో హైడ్రా కూల్చివేతలు
దిశ, దుండిగల్: మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట కత్వ చెరువులో అక్రమంగా నిర్మించిన విల్లాలను హైడ్రా కూల్చివేస్తున్నది. శ్రీలక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ పేరిట ఎన్ఆర్ఐ విజయలక్ష్మి కత్వా చెరువు ఎఫ్టీఎల్/బఫర్ జోన్లలో అక్రమంగా విల్లాలు నిర్మించారని అధికారులు నిర్ధారించారు. ఈ అక్రమ విల్లాలపై "దిశ" దినపత్రిక ఇటీవల వరుస కథనాలు సైతం ప్రచురించింది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిర్మించిన అక్రమ విల్లాలను పరిశీలించారు. నిర్మాణ దారులు, కొనుగోలు దారులకు నోటీసులు ఇచ్చారు. ఆదివారం తెల్లవారుజామున కూల్చివేతకు హైడ్రా సన్నహాలు చేయగా, స్థలానికి రెవెన్యూ, మున్సిపల్, పోలిస్ బృందాలు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. కూల్చివేతలు అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీస్ బలగాలు అడ్డుకొని, కూల్చివేతలు కొనగిస్తున్నారు. ఇదే విధంగా దుండిగల్లో ఉన్న అన్ని చెరువుల్లోని అక్రమ నిర్మాణాలు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.