CV Anand: జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరైన సీవీ ఆనందర్

by Prasad Jukanti |
CV Anand: జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరైన సీవీ ఆనందర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతున్నది. తాజాగా సోమవారం కమిషన్ ఎదుట విజిలెన్స్ డీజీ సీవీ ఆనంద్ హాజరయ్యారు. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి విజిలెన్స్ విచాణపై ఆనంద్ పీసీ ఘోష్ కు వివరించారు. ఇవాళ విజిలెన్స్ మధ్యంతర నివేదిక ఇవ్వనున్నది. ఈ నేపథ్యంలో మరికొన్ని అంశాల గురించి కూడా జస్టిస్ పీసీ ఘోష్ ఆరా తీశారు. అదనపు సమాచారం ఇవ్వడంతో పాటు తుది నివేదిక కూడా త్వరగా ఇవ్వాలని ఈ సందర్భంగా కమిషన్ ఆదేశించారు. కాగా ఇప్పటికే పలువురు అధికారులను విచారించిన కమిషన్ త్వరలోనే ప్రభుత్వం మాజీ పెద్దలను విచారించేందుకు సిద్ధం అవుతున్నది. ఈ క్రమంలో విజిలెన్స్ నివేదిక త్వరగా ఇవ్వాలని కోరడం ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే బుధవారం నంచి జస్టిస్ పీసీ ఘోష్ బహిరంగ విచారణ చేపట్టనున్నది. ఇదివరకే అఫిడవిట్లు దాఖలు చేసిన వారిని విచారించేందుకు సిద్ధం అవుతున్నది. బుధవారం మాజీ ఈఎన్సీ మురళీధర్ ను ప్రశ్నించనున్నది.

Advertisement

Next Story

Most Viewed