- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
సెప్టెంబరు లోగా ఆర్ఆర్ఆర్ భూసేకరణ పనులు పూర్తి చేయాలి : అధికారులకు సీఎస్ ఆదేశాలు
దిశ, వెబ్ డెస్క్ : రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం సెప్టెంబరు రెండవ వారం లోగా భూసేకరణ పనులు పూర్తి చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు సీఎస్ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పురోగతిపై సీఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. భూసేకరణ పనులు వేగవంతం చేయాలని, భూములు కోల్పోతున్న రైతులకు త్వరగా నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలను ఏర్పాటు చేసి భూముల మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం అందేలా చూడాలన్నారు. కోర్టు కేసులపై చొరవ తీసుకొని త్వరగ పరిష్కారం అయ్యేలా చూడాలని సూచించారు. ఈ పనులన్నీ త్వరగా పూర్తి చేస్తే, తదనంతర పనులకు వెళ్లవచ్చునని అన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని ఈ సందర్భంగా సీఎస్ కలెక్టర్లకు సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల కార్యదర్శులతోపాటు.. రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, యాదాద్రి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.