- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
భూకబ్జాలు పెరిగిపోతున్నాయి : రాచకొండ పోలీస్ కమీషనర్కు సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని లేఖ
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలోని ఎక్కడ చూసినా భూకబ్జాలు పెరిగిపోతున్నాయని సీపీఎం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేసారు. ఈ పరిస్థితులపై కూనంనేని రాచకొండ పోలీస్ కమీషనర్కు మంగళవారం ఒక లేఖ రాసారు. హైదరాబాద్ లోని అని ప్రాంతాల్లో అధికారుల అండదండలతో ప్రభుత్వ భూమి, ప్రైవేట్ భూమి అనే తారతమ్యాలు లేకుండా రోజరోజుకి భూకబ్జాదారులు చెలరేగిపోతున్నారని పేర్కొన్నారు. బెదిరింపు చర్యలతో శాంతిభద్రతలకు సైతం విఘాతం కల్పిస్తున్నారని తెలిపారు. మేడిపల్లి ప్రాంతంలోని సర్వేనెంబర్ 109 పార్టు, పంచవటి కాలనీ, నిహారిక కాలనీ మరియు ఇతర సర్వే నెంబర్లలో గల చిన్నాచితక మధ్యతరగతికి చెందిన పలు ప్లాట్లు, అలాగే నివాస ప్రాంతాలు కలిగిన పేద, మధ్యతరగతికి చెందిన సొంతదారులను స్థానిక భూకబ్జాదారులు బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ ఘటనలపై సమగ్ర విచారణ జరిపించి శాంతి, భద్రతలకు విఘాతం కల్పిస్తున్న భూకబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితుల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించే చర్యలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. అలాగే భూకబ్జాదారులకు వత్తాసు పలుకుతున్న అధికారులపైన తగిన కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.