కాంగ్రెస్ అబద్ధాల పుట్ట.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Shiva |
కాంగ్రెస్ అబద్ధాల పుట్ట.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతోందని, ఆ పార్టీ అంటేనే అబద్ధాల పుట్ట అని, అంకెల గారడీలతో ప్రజలను నిట్టనిలువునా మోసం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటైపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి రాగానే.. రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేయడమే తమ మొదటి లక్ష్యమని వరంగల్ రైతు డిక్లరేషన్ సందర్భంగా కాంగ్రెస్ చెప్పిందని అన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన 224 రోజుల తర్వాత కూడా రైతుల రుణాలు సగం మాత్రమే మాఫీ అయ్యాయని తెలిపారు. ఇలా పచ్చి అబద్ధాలతో తెలంగాణ రైతులను నిట్టనిలువునా కాంగ్రెస్ మోసం చేస్తోందని ఫైర్ అయ్యారు. అసలు తెలంగాణలో పంట రుణాలు తీసుకున్న రైతులెందరు.. రూ.2లక్షల్లోపు రుణాలు ఉన్నవారు ఎందరు.. రుణమాఫీ చేసిన వారెందరు? ఆ లెక్కలన్నీ తెలంగాణ ప్రజలకు చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ చెప్పిన దాంట్లో మూడో వంతు రైతులకు కూడా రుణమాఫీ చేయలేదనేది వాస్తవమని అన్నారు. తెలంగాణ రైతుల్లో ఆ అయోమయం తొలగిపోవాలంటే లెక్కలు అందరి ముందు పెట్టాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story