బ్రేకింగ్: కాంగ్రెస్ చేవెళ్ల సభ మరోసారి వాయిదా.. కొత్త తేదీ ప్రకటించిన TPCC..!

by Satheesh |
బ్రేకింగ్: కాంగ్రెస్ చేవెళ్ల సభ మరోసారి వాయిదా.. కొత్త తేదీ ప్రకటించిన TPCC..!
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ చేవెళ్ల సభ మరోసారి వాయిదా పడింది. మొదట ఈ సభ ఆగస్ట్ 18న జరగాల్సి ఉండగా సభ నిర్వహణకు సమయం తక్కువగా ఉండటంతో పాటు పలు కారణాల వల్ల ఈ నెల 24కు వాయిదా పడింది. తాజాగా 24వ తేదీన జరగాల్సిన సభ కూడా మరోసారి వాయిదా పడింది. ఈ సభను తిరిగి 26వ తేదీకి పోస్ట్ పోన్ చేసినట్లు టీపీసీసీ శుక్రవారం వెల్లడించింది. కాగా, ఇప్పటికే రైతు, యూత్ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్.. ఈ సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఈ సభకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరవుతారని ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, 24వ తేదీన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు రాజస్థాన్‌లో ముఖ్యమైన పర్యటన ఉన్న నేపథ్యంలో చేవెళ్ల సభ 26వ తేదీకి వాయిదా పడినట్లు సమాచారం.

Next Story

Most Viewed