ఖమ్మం సీపీకి బీఆర్‌ఎస్‌ నేతల ఫిర్యాదు

by Gantepaka Srikanth |
ఖమ్మం సీపీకి బీఆర్‌ఎస్‌ నేతల ఫిర్యాదు
X

దిశ, వెబ్‌డెస్క్: మున్నేరు వరదలో చిక్కుకుపోయిన బాధితులను పరామర్శించేందుకు వచ్చిన మాజీ మంత్రులకు ఖమ్మంలో అనూహ్య పరిణామం ఎదురైన విషయం తెలిసిందే. బొక్కలగడ్డ, వెంకటేశ్వర్ నగర్, పద్మావతి నగర్‌లో మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావులు పర్యటించి బాధితులను పరామర్శించారు. ఈ సమయంలో కొందరు మాజీ మంత్రుల వాహనాలపై రాళ్లు విసిరారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అక్కడే ఉన్న పోలీసులు రంగ ప్రవేశం చేసి సమస్యను సద్దుమణిగించారు. అనంతరం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాజీ మంత్రి పువ్వాడతో కలిసి ఖమ్మం పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed