హైడ్రా నోటీసులపై స్పందించిన సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి

by Mahesh |   ( Updated:2024-08-29 06:01:17.0  )
హైడ్రా నోటీసులపై స్పందించిన సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటున్న ఇంటికి గురువారం హైడ్రా అధికారులు నోటీసులు అంటించారు. కాగా విషయంపై తిరుపతి రెడ్డి స్పందించారు. తాను 2015లో అమర్ సొసైటీ లో ఇంటిని కొనుగోలు చేశాను. ఆ సమయంలో తాను కొన్న ఇల్లు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందనే సమాచారం తెలియదని చెప్పుకొచ్చారు. అలాగే తాను ఉంటున్న నివాసం.. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంటే ప్రభుత్వం, హైడ్రా ఎటువంటి చర్యలు తీసుకున్న తనకు అభ్యంతరం లేదని సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి చెప్పుకొచ్చారు. కాగా దుర్గం చెరువును అనుకుని ఉన్న కావూరి హిల్స్, సెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు కూడా హైడ్రా నోటీసులు జారీ చేసింది. అలాగే నెల రోజుల్లో అక్రమ కట్టడాలు అన్ని కూల్చేయాలని నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed