- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
SLBC: ఎస్ఎల్ బీసీ రెస్క్యూ ఆపరేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

దిశ, అచ్చంపేట/ తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ఎస్ఎల్బీసీ (SLBC) సొరంగం ప్రమాదం విషయంలో సహాయక చర్యలను కొనసాగించాలని, నిరంతర పర్యవేక్షణకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని సీఎస్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. ఇవాళ అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన రివ్యూ మీటింగ్కు (Review) మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి, సంబంధిత అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన సహాయక చర్యల పురోగతిపై అధికారులపై సీఎం ఆరా తీశారు. రెస్క్యూ ఆపరేషన్పై సీఎంకు ఆర్మీ అధికారులు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు తీసుకోవాలని, ఎక్స్పర్ట్ కమిటీ సూచనలు తీసుకుంటూ రెస్క్యూ ఆపరేషన్లో ముందుకు వెళ్లాలని సూచించారు. కాగా, ఎస్ఎల్బీసీలో రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operation) 32వ రోజుకు చేరుకుంది. సొరంగంలో గత నెల 22న జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు గల్లంతయ్యారు. వారిలో గుర్ప్రీత్ సింగ్ మృతదేహం మాత్రమే కొద్ది రోజుల క్రితం లభ్యమైంది. మిగతా 7 మందిని గుర్తించేందుకు దేశంలోని అత్యుత్తమ ఏజెన్సీలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ పురోగతి కనిపించడం లేదు. అయితే ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదం దేశంలోనే అరుదైనదిగా నిపుణులు చెబుతున్నారు.