ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-03 15:50:59.0  )
ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం లేఖ రాశారు. తెలంగాణలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలని పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో తెలంగాణకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి అండగా నిలవాలని కోరారు. కాగా, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి వరద పరిస్థితులపై ఆరా తీశారు. రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులను, జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. పలు జిల్లాల్లో భారీ వర్షం.. వరదతో వాటిల్లిన నష్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తక్షణ సహాయక చర్యలను.. తీసుకున్న జాగ్రత్తలను వివరించారు. ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం సంభవించిందని ప్రధానికి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed