- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పదేళ్లు ప్రధానిగా ఉండి.. 10 పైసల పని చెయ్యలే.. మోడీపై రేవంత్ ఫైర్
దిశ, వెబ్డెస్క్: ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం చేవెళ్ల నియోజకవర్గ పరిధిలో రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లు ప్రధానిగా ఉన్న మోడీ పది పైసల పని చేయ్యలేదని విమర్శించారు. ఈ పదేండ్లు ప్రధాని మోడీ మనల్ని మోసం చేశాడని ఫైర్ అయ్యారు. రాముడిని కూడా రాజకీయం చేస్తోన్న పార్టీ బీజేపీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లు లేకుండా చేయాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు.
అందులో భాగంగానే బీజేపీ ఈ సారి 400 సీట్లు కావాలని అడుగుతోందని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తోన్న బీజేపీకి ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కారు వదిలి బస్సు ఎక్కారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ బస్సు కూడా ఉండదన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అవుతోందని విమర్శించారు. చేవెళ్లకు కేంద్రం నుండి నిధులు రావాలంటే కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.