మాది చేతల ప్రభుత్వం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

by M.Rajitha |
మాది చేతల ప్రభుత్వం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : మంగళవారం సూర్యాపేట జిల్లాలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. హుజూర్ నగర్లో ఐటిఐ కాలేజీ నిర్మాణానికి భూమి పూజ చేసిన తర్వాత ఆయన క్యాంప్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం హుజూర్ నగర్లో నిర్మిస్తున్న 2160 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను, 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. 2009లో తాము ప్రారంభించిన హౌసింగ్ కాలనీకే బీఆర్ఎస్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు అని చెప్పుకుంటుందని ఎద్దేవా చేశారు. తమది మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమని, వచ్చే ఏడాది జనవై వరకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి అర్హులకు అందజేస్తామని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.

Next Story