- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Chamala Kiran: నూతన పీసీసీ ప్రెసిడెంట్ని కలిసిన భువనగిరి ఎంపీ చామల
దిశ, డైనమిక్ బ్యూరో: నూతన పీసీసీ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ కు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ నూతన అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని హైదరాబాద్ లోని వారి నివాసంలో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్సీని శాలువాతో సత్కరించి, పుష్ప గుచ్ఛం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు టిపిసిసి మీడియా కోఆర్డినేటర్ శ్రీకాంత్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్ సహా ఇతర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కాగా తెలంగాణ రాష్ట్రానికి కొత్త పీసీసి ప్రెసిడెంట్ గా 35 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్న ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ను ప్రకటిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ నెల 7వ తేదీన నియామక ఉత్తర్వులు జారీ చేశింది.