మహాశక్తి ఆలయ ఆవరణలో శమీ పూజ నిర్వహించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

by karthikeya |
మహాశక్తి ఆలయ ఆవరణలో శమీ పూజ నిర్వహించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ రోజు (శనివారం) కరీంగనర్‌లోని మహాశక్తి ఆలయ ఆవరణలో శమీ పూజ నిర్వహించారు. ఆయనతో పార్టీ నేతలు, భక్తులు పెద్ద ఎత్తున ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూజ అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. హిందూ బంధువులందరికీ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని శక్తివంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆకాంక్షించారు.

స్వార్థం, కల్మషం వీడి శక్తివంతమైన సమాజ నిర్మాణం కోసం అందరం కలిసి పనిచేద్దామని, ఒకరి కష్టసుఖాలు మరొకరు పంచుకుంటూ ఐకమత్యంతో ఉండాలని కోరారు. అందరం కలిసి మంచి కోసం అమ్మవారిని వేడుకోవాలని, అందరిలో మంచి ఆలోచనలతో జీవిచాలని ఆకాంక్షించారు.

అనంతరం ప్రధాని మోడీ గురించి మాట్లాడుతూ.. మోడీ నాయకత్వంలో శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని, అవన్నీ ఎలాంటి అవరోధం లేకుండా గొప్పగా సాగాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు. ‘‘భారతమాతను విశ్వగురు స్థానంలో ఉంచేందుకు తమ నాయకుడు మోడీ చేస్తున్న కృషి సాకారమయ్యేలా అమ్మవారి ఆశీస్సులందించాలని ఆకాంక్షించారు. కరీంనగర్ పార్లమెంట్‌ నియోజకవర్గంతో పాటు తెలంగాణ అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రజలంతా కలిసి ఐకమత్యంగా అమ్మవారిని వేడుకుందామని భక్తులకు పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed