TG floods : వరద నష్టం పరిశీలనకు కేంద్ర బృందం.. సచివాలయంలో సమావేశం

by Ramesh N |   ( Updated:2024-09-11 07:33:13.0  )
TG floods : వరద నష్టం పరిశీలనకు కేంద్ర బృందం.. సచివాలయంలో సమావేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: వరద నష్టం పరిశీలనకు కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చింది. తెలంగాణలో భారీ వర్షాలు వరదల వల్ల జరిగిన నష్టం పై రాష్ట్ర సచివాలయంలో తాజాగా ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను కేంద్ర బృందం తిలకించింది. జరిగిన నష్టాన్ని ఫోటో ఎగ్జిబిషన్ ఫోటోల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ హనుమంతరావు కేంద్ర బృందానికి వివరించారు.

అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర బృందం పాల్గొంది. వర్షాలు వరదలు ద్వారా వివిధ శాఖలకు ఏర్పడ్డ నష్టాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. సమావేశం అనంతరం జిల్లాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి కేంద్ర బృందం వెళ్లింది.

Advertisement

Next Story

Most Viewed