Bus Accident : ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా .. 40 మంది విద్యార్థులకు తీవ్రగాయాలు.. !

by Maddikunta Saikiran |
Bus Accident : ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా .. 40 మంది విద్యార్థులకు తీవ్రగాయాలు.. !
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య బస్సు ప్రమాదాలు ఎక్కువయిపోతున్నాయి. రవాణా శాఖ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్న బస్సు ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. ఈ రోజు సాయంత్రం రంగారెడ్డి జిల్లా కాటేదాన్ ప్రాంతంలో పయోనీర్ స్కూల్ బస్సు ప్రమాదానికి గురయింది. బస్సు యొక్క బ్రేక్ ఫెయిల్ కావడంతో ఓ మూల మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో బస్సు లో ఉన్న 40 మంది స్కూల్ విద్యార్థులు గాయాలు పాలయ్యారు.తృటిలో వారికి ప్రాణాపాయం తప్పింది.ఈ క్రమంలో .. వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీస్ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.కాగా.. ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది.

Next Story

Most Viewed