BREAKING: మత చిచ్చు పెట్టాలనుకుంటున్న బీజేపీని తరమికొట్టండి: సీఎం రేవంత్‌రెడ్డి హాట్ కామెంట్స్

by Disha Web Desk 1 |
BREAKING: మత చిచ్చు పెట్టాలనుకుంటున్న బీజేపీని తరమికొట్టండి: సీఎం రేవంత్‌రెడ్డి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మత చిచ్చు పెట్టాలనుకుంటున్న బీజేపీని ప్రజలే తరిమికొట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రచారంలో భాగంగా ఆయన సరూర్‌నగర్ జన జాతర సభలో రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18వ లోక్‌సభ ఎన్నికలు దేశ ప్రజలకు జీవన్మరణ సమస్యగా పరిణమించాయని ఆందోళన వ్యక్తం చేశారు. అణగారిన వర్గాల కోసం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నేడు బీజేపీ కారణంగా ప్రమాదంలో పడిందని ఆరోపించారు. రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దర్కిన రిజర్వేషన్లు కూడా ప్రమాదంలో పడ్డాయని అన్నారు. రిజర్వేషన్లను రద్దు చేసేందుకే అమిత్ షా, నరేంద్ర మోడీ దేశం అంతటా చక్కర్లు కొడుతున్నారని దుయ్యబట్టారు.

ఇందిరా గాంధీ తన చివరి శ్వాస విడిచేటప్పుడు తెలంగాణ ఎంపీగానే ఉన్నారని గుర్తు చేశారు. బీజేపీ అన్యాయాలను, అకృత్యాలను తుదముట్టించేందుకు మోదీ, అమిత్ షాలపై రాహుల్ గాంధీ యుద్ధం ప్రకటించారని తెలిపారు. తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు రాహుల్ అండగా నిలబడి రిజర్వేషన్లు కాపాడుకోవాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 15 సెకన్లు పాటు సమయమిస్తే.. మైనార్టీలను లేకుండా చేస్తామంటూ నిన్న తెలంగాణకు వచ్చిన ఓ బీజేపీ ఎంపీ మాట్లాడారని.. ఇదేక్కడ న్యాయమో మోడీయే సమాధానం చెప్పాలన్నారు. మత కలహాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. హైదరాబాద్‌లో మత చిచ్చు పెట్టాలని చూస్తున్న బీజేపీకి ఓటుతోనే బుద్ధి చెప్పాలని రేవంత్ రెడ్డి అన్నారు.

Read More...

BREAKING: ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీజేపీకి గుర్తొచ్చేది ఆయనే : సీఎం రేవంత్‌రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

Next Story

Most Viewed