BREAKING: ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డుపై పోలీసుల ముమ్మర తనిఖీలు.. రూ.58.86 లక్షల నగదు స్వాధీనం

by Disha Web Desk 1 |
BREAKING: ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డుపై పోలీసుల ముమ్మర తనిఖీలు.. రూ.58.86 లక్షల నగదు స్వాధీనం
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన మరుక్షణమే దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు సరిహద్దులతో పాటు ప్రధాన చెక్‌పోస్టుల వద్ద విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. నేతలు ఓటర్లను డబ్బు, మద్యం, ఇతర వుస్తువలతో ప్రలోభాలకు గురి చేయకుండా రాత్రింబవళ్లు పకడ్బందీగా పహారా కాస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ రంగారెడ్డి జిల్లా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ కారులో రూ.58.86 లక్షల నగదును గుర్తించారు. ఈ మేరకు పట్టుబడిన డబ్బుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో నగదును సీజ్ చేశారు. అయితే, పట్టుబడిన నగదు ఎవరిదై ఉంటుందని పోలీసులు ఆరా తీస్తున్నారు.

Read More...

చార్ సౌ అనేది సీట్ల గురించి కాదు పెట్రోల్ రేట్ల గురించి!.. బీజేపీపై కేటీఆర్ సెటైర్

Next Story

Most Viewed