BREAKING: నా చారిటీని కొంతమంది కుట్రతో రద్దు చేయించారు : కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

by Shiva |
BREAKING: నా చారిటీని కొంతమంది కుట్రతో రద్దు చేయించారు : కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తన చారిటీని కావాలనే కొంతమంది కుట్రతో రద్దు చేయించారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. ఇవాళ ఆయన సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతిని ఆయన కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సదాశివపేట్‌లో కబ్జాకు గురైన తన చారిటీ భూములపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు తెలిపినట్లుగా పేర్కొన్నారు. చారిటీ ద్వారా సుమారు 53 వేల మందికి ఉచితంగా అన్నం పెట్టి కడుపు నింపానని అన్నారు. కావాలని తన చారిటీని కొంతమంది కుట్రతో రద్దు చేయించారని ఆరోపించారు. అదేవిధంగా భూములను లాక్కునేందుకు తమపై దాడులు చేసిన బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed