మంత్రి పొన్నంను కలిసిన బీసీ కమిషన్ చైర్మన్..సభ్యులు

by Y. Venkata Narasimha Reddy |
మంత్రి పొన్నంను కలిసిన బీసీ కమిషన్ చైర్మన్..సభ్యులు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ జీ.నిరంజన్, కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్ ,తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మిలు సెక్రటేరియట్ లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పడిన బీసీ కమిషన్ చైర్మన్ ,సభ్యులను మంత్రి పొన్నం సత్కరించారు. అనంతరం వారు రాష్ట్రంలో బీసీల అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యలు..బీసీ కుల గణన, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశాలపై చర్చించారు. నూతన బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు ఈ సెప్టెంబరు 9న ప‌ద‌వీ బాధ్యతలు చేపట్టారు.

Next Story