మహిళను 59 ముక్కలుగా నరికి హత్య చేసిన నిందితుడు ఆత్మహత్య

by Mahesh |
మహిళను 59 ముక్కలుగా నరికి హత్య చేసిన నిందితుడు ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: బెంగళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో మహేశ్వరి అనే మహిళను ఓ వ్యక్తి 59 ముక్కలుగా నరికి దారుణంగా హత్య చేశారు. ఈ దారుణమైన మూడు రోజుల క్రితం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ సమాచారం అందుకున్న పోలీసులు మహిళా ఇంట్లోని రిఫ్రిజిరేటర్‌లో ఆమె శరీరభాగాలను చూసి అవక్కయ్యారు. వారం రోజుల క్రితం మహిళ హత్య జరిగి ఉంటుందని పోలీసులు గుర్తించారు. మృతురాలు మహాలక్ష్మీ సంవత్సరం క్రితం తన భర్తతో విడిపోయి.. మల్లేశ్వరం ప్రాంతంలోని ఓ మాల్ లో పనిచేస్తూ.. ఒంటరిగా ఉంటుందని.. ఈ సమయంలో మాల్ లో తమ టీమ్ లీడర్ గా ఉన్న ఓ వ్యక్తితో రిలేషన్ కొనసాగించింది. ఇదే సమయంలో మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటం రంజన్ గమనించాడు.. ఈ క్రమంలోనే అతని మహాలక్ష్మిని హత్య చేసాడనే అనుమాతనంతో అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా బుధవారం రాత్రి సమయంలో నిందితుడిగా బావిస్తున్న ముక్తి రంజన్‌రాయ్ ఒడిశాలో ఆత్మహత్య చేసుకున్నాడు.

Next Story

Most Viewed