ముగిసిన AP కేబినెట్ భేటీ.. మంత్రి మండలి తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే

by Satheesh |
ముగిసిన AP కేబినెట్ భేటీ.. మంత్రి మండలి తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన మంత్రి మండలి పలు కీలక అంశాలపై డిస్కస్ చేసి నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి భారీగా నిధులు కేటాయించినందుకుగానూ రాష్ట్ర మంత్రి వర్గం కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. ప్రభుత్వానికి అతి ముఖ్యమైన పోలవరం ప్రాజెక్ట్, రాజధాని అమరావతి నిర్మాణాలపై కీలక చర్చ జరిగింది. కేంద్ర బడ్జెట్‌లో అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం రూ.15000 కోట్లు కేటాయించడంతో ఇక పనులను స్పీడప్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి కేబినెట్ తీర్మానం అవసరమని కేంద్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఆ టాపిక్‌పైన డిస్కస్ చేసినట్లు టాక్.



Next Story