తెలంగాణలో 10 సీట్లు సాధిస్తాం.. అమిత్ షా ధీమా

by Gantepaka Srikanth |
తెలంగాణలో 10 సీట్లు సాధిస్తాం.. అమిత్ షా ధీమా
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వేళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో మూడోసారి గెలిచి తాము హ్యాట్రిక్ కొట్టబోతున్నామని జోస్యం చెప్పారు. దేశ వ్యాప్తంగా 400 పైచిలుకు స్థానాల్లో సత్తా చాటబోతున్నట్లు తెలిపారు. ఇటీవల ఆయన ఓ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. సౌత్‌లోనూ మంచి ఫలితాలు చూస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక తెలంగాణలో 10 సీట్లు గెలుస్తామనే నమ్మకం ఉందని జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని అన్నారు. అటు దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాలు, తూర్పు భారత్(బెంగాల్, జార్ఖండ్, బిహార్, ఒడిశా) రాష్ట్రాల్లో తాము పెద్ద పార్టీ అవతరిస్తామని తెలిపారు. ఒడిశాలో 17 లోక్‌సభ సీట్లు, 75 అసెంబ్లీ సీట్లు టార్గెట్ పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. 2014, 2029 తరహాలో ఈసారి కూడా విశ్లేషకుల అంచనాలు తలకిందులు కాబోతున్నాయని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed