ప్రయాణికులకు అలర్ట్.. 1400 బస్సులు రద్దు చేసిన టీజీ ఆర్టీసీ

by Mahesh |   ( Updated:2024-09-02 15:23:36.0  )
ప్రయాణికులకు అలర్ట్.. 1400 బస్సులు రద్దు చేసిన టీజీ ఆర్టీసీ
X

దిశ, వెబ్ డెస్క్: గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వరదలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. వదల కారణంగా చాలా ప్రాంతాల్లో రహదారుల కొట్టుకుపోయాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో నడిపే 1400 బస్సులను రద్దు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ బస్సుల్లో అత్యధికంగా ఖమ్మం, విజయవాడ, మహబూబాబాద్ వైపు వెళ్లే బస్సులు ఉన్నట్లు తెలిపారు. అలాగే మరికొన్ని బస్సులను రూట్ మార్చి నడుపుతున్నామని.. అందులో విజయవాడకు వెళ్లే బస్సులను సూర్యాపేట మీద నుంచి కాకుండా గుంటూరు మీదుగా దారి మళ్లించినట్లు తెలిపారు. అలాగే వర్షాలతో పాటు వరదలు తగ్గగానే బస్సు సర్వీసులను పునరుద్దరిస్తామని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed