ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల రక్షణకు పటిష్ట భద్రత : కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

by Aamani |
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల రక్షణకు పటిష్ట భద్రత :  కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
X

దిశ, ఆసిఫాబాద్ : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల రక్షణకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోదాము సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం గత పార్లమెంట్ ఎన్నికల్లో సాంకేతిక సమస్యలతో ఆగిపోయిన 1 బ్యాలెట్ యూనిట్. 10 వీవీ ప్యాట్ లను మరమ్మతుల కోసం ఈసీఎల్ హైదరాబాద్ కు పంపించనున్నట్లు తెలిపారు. ఈవీఎం గోదాములో పోలీస్ భద్రత తో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిరంతరం నిఘాలో ఉంటుందని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed