- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
గ్రామాల అభివృద్ధికి రహదారులే ప్రధానం
by Sridhar Babu |
X
దిశ, కుబీర్ : గ్రామాల అభివృద్ధికి రహదారులే ప్రధానమని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. శనివారం మండల కేంద్రం నుంచి తొట్టంబ వరకు బీటీ రోడ్డు పనులకు స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది మహారాష్ట్ర సరిహద్దు రహదారి కావడంతో రోడ్డు పనులు త్వరగా పూర్తయితే వ్యాపారాలు పెరుగుతాయన్నారు.
అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ వసంత రమేష్, మాజీ ఎంపీపీ వడ్నం జ్యోతి నాగేష్, నాయకులు రాథోడ్ గులాబ్, సాయినాథ్, గంగా శేఖర్, నాగేందర్, వెంకట్రావు పటేల్, బీజేపీ మండల అధ్యక్షుడు యేశాల దత్తాత్రి, పార్టీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Advertisement
Next Story