విధుల్లోకి చేరుతున్న నూతన ఉపాధ్యాయులు..

by Sumithra |
విధుల్లోకి చేరుతున్న నూతన ఉపాధ్యాయులు..
X

దిశ, బోథ్ : బోథ్ మండలంలోని వివిధ గ్రామాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు గాను 23 మంది నూతన ఉపాధ్యాయులు విధుల్లో చేరుతున్నారు. బుధవారం నూతన ఉపాధ్యాయులకు అపాయింట్మెంట్ పత్రాలను ఎమ్మార్సీ భవనంలో అందిస్తున్నారు. స్థానికంగా మండల విద్యాధికారి లేకపోవడంతో ఎంఆర్సీ సిబ్బంది అపాయింట్మెంట్ పత్రాలను అందిస్తున్నారు. కాగా గత నెల 30న మండల విద్యాధికారి పదవీ విరమణ పొందడంతో ఆయన స్థానంలో ఎంఈఓను ఇంత వరకు నియమించలేదు. దీంతో మండలంలో విధుల్లోకి చేరెందుకు వచ్చిన నూతన ఉపాధ్యాయులు అయోమయానికి గురయ్యారు.

Advertisement

Next Story

Most Viewed