బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి.. ఎమ్మెల్యే కోవలక్ష్మి..

by Sumithra |
బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి.. ఎమ్మెల్యే కోవలక్ష్మి..
X

దిశ, వాంకిడి : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని వర్గాల సంక్షేమ అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. ఆదివారం మండలంలోని రాంనగర్ లో డీఎంఎఫ్టీ రూ.10 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన పోచమ్మ ఆలయాన్ని మాజీ జడ్పీటీసీ అజయ్ కుమార్, పీఏఎంసీ చైర్మన్ పెంటు, వాంకిడి మాజీ సర్పంచ్ బండే తుకారాం, ఆరె సంఘం జిల్లా అధ్యక్షుడు జైరాం, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు మర్సుకోల సరస్వతిలతో కలిసి ఆమె ప్రారంభించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ పాలనలో రాజకీయాలకు ఆతీతంగా అందరికి సంక్షేమ ఫలాలు అందించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారని ఆమె పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed