నిర్మల్ జిల్లా అభివృద్ధికి అందరం తోడ్పడాలి.. ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య

by Nagam Mallesh |
నిర్మల్ జిల్లా అభివృద్ధికి అందరం తోడ్పడాలి.. ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య
X

దిశ, ప్రతినిధి నిర్మల్ః నిర్మల్ జిల్లా అభివృద్ధికి అందరం తోడ్పడాలని ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జరిగిన ఉత్సవాల్లో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పేద ప్రజల సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు పేదలకు అన్ని సంక్షేమ పథకాలు అందిన రోజే అసలైన స్వాతంత్రం లభించినట్టు అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు నిర్మల్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నదని చెప్పారు జిల్లా కలెక్టర్ సహా అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాను అన్ని రంగాల్లో ముందు ఉంచాలని ఆయన సూచించారు అనంతరం ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించారు పలు శాఖలు చేపట్టిన అభివృద్ధి పనులను శకటాల ద్వారా ప్రదర్శించారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించారు అనంతరం ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను ఆయన అందజేశారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఎస్పీ జానకి షర్మిల అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed