తనిఖీల్లో రూ.5.17 లక్షల నగదు సీజ్

by Disha Web Desk 23 |
తనిఖీల్లో రూ.5.17 లక్షల నగదు సీజ్
X

దిశ,నేరడిగొండ : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఇందులో బాగంగానే నేరడిగొండ మండల రోల్ మామడ టోల్‌ప్లాజా చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు శుక్రవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో ఇద్దరు నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి నేరడిగొండ వైపు వస్తున్న వ్యక్తి నుండి రూ.2,50,000 ,కరీంనగర్ నుండి మహారాష్ట్ర వెళుతున్న వ్యక్తి నుండి రూ. 2,67,000 నగదు లభ్యమయ్యాయి. నగదుకు సంబంధించి ఎలాంటి రసీదులు చూపకపోవడంతో స్వాధీనం చేసుకొని నేరడిగొండ ఎస్ఐ శ్రీకాంత్ నగదును సీజ్ చేసి ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు అప్పగించారు.

Next Story

Most Viewed