ఢిల్లీ పోలీసులు కాదు… సుల్తాన్ వచ్చిన ఎదుర్కొంటా : సీఎం రేవంత్ రెడ్డి

by Disha Web Desk 11 |
ఢిల్లీ పోలీసులు కాదు… సుల్తాన్ వచ్చిన ఎదుర్కొంటా : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, ఆసిఫాబాద్ : ఢిల్లీ పోలీసులు కాదు… ఢిల్లీ సుల్తాన్ వచ్చిన ప్రజలు అండగా ఉంటే ధైర్యంగా ఎదుర్కొంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం ఆసిఫాబాద్ జిల్లాలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ ఆదిలాబాద్ జిల్లాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. దొర లక్షణాలు గల గేడం నాగేష్ కు ఎంపీ టికెట్ ఇచ్చి సోయం బాపురావుకు బీజేపీ మోసం చేసి, గిరిజనులపై కపటప్రేమ చూయిస్తుండ్రని ఎద్దేవా చేశారు. గోండులు, లంబాడాలు తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తే మోడీ, కేసీఆర్ పట్టించుకోలేదన్నారు.

అధికారంలో ఉన్న కేసీఆర్, మోదీ ఏనాడూ గిరిజనుల సమస్యలను పట్టించుకోలేదని కానీసం పోడు భూముల సమస్యలపై కేసీఆర్ దృష్టి పెట్టలేదని అన్నారు. ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధికి కృషి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేదని విమర్శించారు. కేంద్ర మంత్రి వర్గంలో గోండులకు స్థానం ఇవ్వలేదని గుర్తు చేశారు. ప్రధాని మోదీ,అమిత్ షా తనను బెదిరించలేరని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రిజర్వేషన్లు కొనసాగాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు. ఆదిలాబాద్ ప్రజలు అండగా ఉన్నంత కాలం ఢిల్లీ సుల్తాన్లను అయినా ధైర్యంగా ఎదుర్కొంటానని అన్నారు. కేసీఆర్ పదేళ్లు 200 కేసులు పెట్టిన భయపడని తనపైకి ఢిల్లీ పోలీసులను ఉసిగొల్పితే కుమ్రంభీం, రాంజీ గోండు మాదిరిగా తిరగబడతారని సీఎం హెచ్చరించారు.

Read More..

హరీష్ రావు నుంచి సిద్దిపేటకు విముక్తి కల్పిస్తా.. CM రేవంత్ ప్రకటన

Next Story

Most Viewed