- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
స్క్రాప్ వ్యాపారి హత్య కేసులో నిందితుడి అరెస్ట్
దిశ, చార్మినార్ : తన భార్యతో ఫోన్లో ఎందుకు మాట్లాడతున్నావని అడిగిన స్క్రాప్ వ్యాపారిని కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి హతమార్చిన నిందితుడిని ఫలక్నుమా పోలీసులు అదుపులోకి తీసుకుని ఆదివారం రిమాండ్కు తరలించారు. ఫలక్ నుమా డివిజన్ ఏసీపీ ఎం.ఎ జావిద్, ఫలక్నుమా ఇన్స్పెక్టర్ కె.ఆదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ... ఫాతిమా నగర్ అమ్జదుల్లాబాగ్ ప్రాంతానికి చెందిన మొహమ్మద్ సాజిద్ (37) స్క్రాప్ వ్యాపారి. ఇతనికి భార్య ,ముగ్గురు పిల్లలు ఉన్నారు. వట్టే పల్లి ఫాతిమా నగర్ ప్రాంతానికి చెందిన మొహమ్మద్ సిద్దిక్ (22) వృత్తి రీత్యా ఆటో డ్రైవర్. మూడు సంవత్సరాల క్రితం మొహ్మద్ సాజిద్, మొహమ్మద్ సిద్దిక్ లు స్థానికంగా ఉండేవారు. సాజిద్ భార్యతో మొహమ్మద్ సిద్దిక్ ఫోన్లో మాట్లాడేవాడు. ఈ నేపథ్యంలోనే సంవత్సరం క్రితం సాజిద్, సిద్దిక్ ల మధ్య వివాదం తలెత్తింది.
వారి మధ్య ఘర్షణ తారా స్థాయికి చేరుకోవడంతో పెద్దల సమక్షంలో ఇద్దరిని పిలిచి రాజీ కుదిర్చారు. సాజిద్ తన భార్యపై అనుమానం పెంచుకోవడంతో పాటు 10 రోజుల క్రితం భార్యతో గొడవపడ్డాడు. దీంతో ఆమె తన సోదరుడు సబ్రామ్ ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పింది. ఆమె కోసం సిద్దిక్ అక్కడికి కూడా వెళ్లడం ప్రారంభించాడు. దీంతో సబ్రామ్ ఈ విషయం పై మాట్లాడుదామని ఈ నెల 9వ తేదీన సాయంత్రం సిద్దిక్ ను పిలిచాడు. కాసేపటికే సాజిద్ కూడా అక్కడికి చేరుకున్నాడు. దీంతో మరోసారి వారి మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుకుంది. కోపోద్రిక్తుడైన సిద్దిక్ వెంట తెచ్చుకున్న కత్తితో సాజిద్పై విచక్షణారహితంగా దాడిచేశాడు. తీవ్రగాయాలపాలైన సాజిద్ అక్కడిక్కడే మృతి చెందాడు. దీంతో షేక్ అర్బాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫలక్నుమా పోలీసులు కేసు నమోదు చేసుకుని అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న సిద్దిక్ను అదుపులోకి తీసుకుని ఆదివారం రిమాండ్కు తరలించారు.ఈ కేసును ఫలక్నుమా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.