- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
తెలంగాణలో సంచలన పరిణామం.. కాసేపట్లో చంద్రబాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ(Telangana)లో సంచలన పరిణామం చోటు చేసుకోబోతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(Brs Mlas) కాసేపట్లో కలవుబోతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డితో పాటు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో చంద్రబాబును కలవనున్నారు. మంగళవారం ఢిల్లీలో కేంద్రపెద్దలతో జరగనున్న సమావేశంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకున్నారు. దీంతో చంద్రబాబును కలిసి మల్లారెడ్డి మనుమరాలు శ్రేయరెడ్డి పెళ్లికి ఆహ్వానించనున్నారు. మల్లారెడ్డి, కృష్ణారావు, తీగల కృష్ణారెడ్డి గతంలో టీడీపీలో పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత సైతం పార్టీలో కొనసాగారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో టీడీపీని వీడారు. ప్రస్తుతం బీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. మల్లారెడ్డి మనుమరాలు శ్రేయరెడ్డి వివాహం నేపథ్యంలో చాలా రోజుల తర్వాత మళ్లీ చంద్రబాబును కలవబోతున్నారు.